ఎన్టీఆర్ ?జనతా గ్యారేజ్? మోత మొదలైంది. ఇప్పుడీ చిత్రాన్ని కొన్ని విషయాల్లో ?బాహుబలి? తర్వాతి స్థానంలో నిలవడం విశేషం. ఇప్పటికే కేరళ గ్యారేజ్ పై భారీ అంచనాలున్నాయి. అక్కడ ఇప్పటి వరకు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ దే హవా. ఇప్పుడు బన్నీ రికార్డులన్నీ బద్దలు కొట్టి బాహుబలి తర్వాత అత్యధికంగా వసూలు చేసిన చిత్రంగా గ్యారేజ్ నిలవడం గ్యారేంటీ అని చెబుతున్నారు. కేరళలో బాహుబలి దాదాపు 14కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు గ్యారేజ్ బాహుబలికి దరిదాపుల్లోకి వెళ్లే అవకాశాలున్నట్టు సమాచారమ్.
తెలుగు, మలయాళ భాషలలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ పై తమిళంలో కూడా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. తమిళనాట 100కి పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఒక అనువాద చిత్రంగా తమిళనాట ఈ స్థాయి థియేటర్లలో విడుదల చేస్తుడడం ఒక రికార్డే. ఈ మధ్యకాలంలో బాహుబలి తరువాత తమిళంలో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తోన్న తెలుగు చిత్రం ఇదేనట. సమంత, నిత్యామీనన్ కు తమిళంలో మంచి క్రేజ్ ఉంది. దీంతో.. కోలీవుడ్ లోనూ గ్యారేజ్ మంచి కలెక్షన్స్ ని రాబట్టే అవకాశాలున్నాయి.