Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Oct-2015 13:56:17
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో అన్నాదమ్ముళ్లు - బాబాయ్ అబ్బాయ్ లు బావామరుదుల వరసయ్యే స్టార్ హీరోలు ఉన్నారు మనకు. కానీ అక్కినేని వంశాంకురాలు అందరూ కలిసి "మనం" మూవీని చేసి.. డైలాగ్సే కాదు - స్క్రీన్ ప్రెజెన్స్ తోనూ అలరించారు. కనీసం అందరూ ఒకేసారి కాకపోయినా.. కనీసం ఓ ఇద్దరు కలిసైనా మల్టీస్టారర్లు చేసే రోజులు వస్తాయని ఆశించారు ప్రేక్షకులు.

ఇప్పటికైతే అక్కినేని వంశం హీరోల నుంచి మల్టీ స్టారర్లు బాగానే ఎక్స్ పెక్ట్ చేయచ్చు. మరి నందమూరి వంశం హీరోల సంగతే ఇంకా తేలలేదు. మా వంశం బ్లడ్ అనే డైలాగ్స్ తో బాగానే అలరిస్తున్నారు కానీ.. కలిసి స్క్రీన్ పై కనిపించడం లేదు. బాలయ్య సింగిల్ గానే హ్యాండిల్ చేసేస్తారు ఏ మూవీనైనా. యువవ హీరోలైనా కలిసి నటిస్తారని ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. సెట్స్ పై లేకపోయినా... కనీసం ఆలోచనల్లో అయినా ఇలాంటి ప్రాజెక్ట్ ఉండే ఉంటుందిలే అనుకున్నారు ఫ్యాన్సు. జూ.ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ కలసి స్టోరీ సెట్ రైట్ అయితే తెరపై కనిపిస్తారని అనుకుంటున్న సమయంలో.. ఇప్పటికి అలాంటి ఆలోచన లేదని తేల్చేశాడు కళ్యాణ్ రామ్.

ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ షేర్ ప్రచారం చేస్తున్న కళ్యాణ్ రామ్.. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పేశాడు. ఆయన చెప్పినదాని ప్రకారం ఇంకా ఆలోచన కూడా లేదట. ఒకవేళ వీళ్లిద్దరూ కలిసి కనిపించాలంటే.. ముందు ఆలోచన రావాలి అది ప్రాజెక్ట్ గా మారి పట్టాలెక్కాలి - సెట్స్ కి వెళ్లాలి - సినిమా తీయాలి. మొదలే లేదని కళ్యాణ్ రామ్ చెప్పేశాడు కాబట్టి.. ఇప్పట్లో నందమూరి వంశ హీరోలతో మల్టీస్టారర్ ఎక్స్ పెక్ట్ చేయడం కష్టమే.

,  ,  ,  ,