వరుణ్తేజ్ ? క్రిష్ కలయికలో వచ్చిన చిత్రం కంచె. రెండో ప్రపంచ యుద్ధం బ్యాగ్ డ్రాప్ లో వచ్చినీ ప్రేమకధ విమర్శకుల ప్రసంశలతో పాటు, వసూళ్లు కూడా దక్కాయి. ఉత్తమ పాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఇప్పుడీ సినిమా పై బాలీవుడ్ కన్నుపడింది. హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమా అక్కడ రిమేక్ చేయాలని భావిస్తున్నాడని తెలుస్తోంది.
గబ్బర్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు క్రిస్. అక్షయ్ కుమార్తో క్రిష్ తీసిన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది. క్రిష్ ప్రతిభ కూడా అక్కడి జనాలకు తెలిసింది. ఇప్పుడా గురితోనే కంచె పై మనసు పడ్డాడు అక్షయ్ కుమార్. ఇటివల అక్షయ్ తాజా సినిమా ?రుస్తుం ?పబ్లిసిటీ లో బాగంగా హైదరబాద్ వచ్చిన ఆయన క్రిష్ తో ఈ మేరకు చర్చలు జరిపాడని తెలిసింది.
అయితే ఈ రిమేక్ రైట్స్ ఇవ్వడమా? లేదా స్వయంగా క్రిష్ ఈ సినిమాని అక్కడ దర్శకత్వం వహించడమా? అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్రా శాతకర్ణి తో బిజీ గా వున్నాడు క్రిష్. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఏ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం వుంది.