టాలీవుడ్ సినిమాలకు ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ కూడా చాలా ముఖ్యం. ఇక్కడ ఓ ఏరియాకి సమానంగా అక్కడ కూడా వసూళ్లు సాధించేస్తున్నాయి తెలుగు సినిమాలు. అయితే.. ఇక్కడి మార్కెట్లో మాస్ సినిమాలకు అంతగా ఆదరణ ఉండదనే విషయం అందరికీ తెలుసు. మహేష్ మినహా ఏ హీరోలకు ఇప్పటివరకూ మాస్ సినిమాలు ఆడిన.. కనీస వసూళ్లు వచ్చిన దాఖలాలు లేవు.
కానీ చిరు-పవన్ లు మాత్రం ఓవర్సీస్ లెక్కలు మార్చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే.. ఖైదీ నంబర్ 150 అంటూ మాస్ మూవీతో సెన్సేషన్ సృష్టించేశారు. ప్రీమియర్స్ తోనే 1.2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది ఖైదీ. ఫుల్ రన్ లో.. టాలీవుడ్ టాప్ 4 కి చేరిపోయింది కూడా. ఇప్పుడు వంతు పవర్ స్టార్ ది. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు అల్ట్రా మాస్ మూవీ అనే విషయం.. టీజర్ తోనే చెప్పేశారు. అయినా సరే.. ఓవర్సీస్ లో టాలీవుడ్ లోనే అతి పెద్ద రిలీజ్ ఓవర్సీస్ గా రికార్డు సృష్టిస్తోంది.
250 స్క్రీన్లలో రిలీజ్ చేయడమే కాదు.. అన్ని చోట్లా ప్రీమియర్స్ పడుతున్నాయి. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో పవన్ కొత్త రికార్డు సృష్టిస్తాడని ట్రేడ్ జనాలు అంచనా వేస్తున్నారు. యాక్షన్ మూవీ అయినా.. ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ అయిన చిత్రం కావడంతో.. మూవీ బాగుంటే మాత్రం కాటమరాయుడు కూడా ఓవర్సీస్ టాప్5లోకి చేరిపోయే అవకాశాలున్నాయంటున్నారు