హిట్ కుండే గుర్తింపు ఇంక దేనికీ ఉండదు. అదే వరస హిట్లు కొడుతుంటే వాళ్ల ఇమేజ్ అలా పెరిగిపోతూనే ఉంటుంది. వారు కోరింది ఇవ్వడానికి అంతా సిద్ధమైపోతారు. ఈ విషయం స్టార్ హీరోలతో పాటు స్టార్ డైరెక్టర్లు సైతం బాగానే వంటబట్టించుకున్నారు. ఈ విషయం నిర్మాత కమ్ హీరో రామ్ చరణ్ తేజ్ కు రీసెంట్ గా స్పష్టంగా తెలిసొచ్చింది.
మిర్చి సినిమాతో డైరెక్టర్ అయిన కొరటాల శివ తర్వాత శ్రీమంతుడు జనతా గ్యారేజ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి టాప్ డైరెక్టర్స్ లీగ్ లో చేరిపోయాడు. అసలుకు మిర్చి సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ తో కొరటాల శివ సినిమా చేయాల్సి ఉంది. బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా ఈ సినిమాకు అంతా సిద్ధమైనా తర్వాత మొత్తం పక్కన పెట్టేశారు. దాంతో కొరటాల శివ వేరే దారి వెతుక్కుని మహేష్ తో శ్రీమంతుడు తీశాడు. ఆ సినిమా రికార్డులు కొల్లగొట్టడం.. తర్వాత జనతా గ్యారేజ్ కూడా సూపర్ హిట్ అవడంతో కొరటాల శివ రేంజ్ పెరిగిపోయింది. తాజాగా రామ్ చరణ్ కొరటాల శివతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా చేయబోతున్నారు. అప్పట్లో అయితే కొరటాల ఫ్రీ బడ్జెట్ లోనే దొరికేసేవాడు. ఇప్పుడు రేంజ్ పెరగడంతో డైరెక్టర్ రెమ్యూనరేషన్ కింద రూ. 14 కోట్లు తీసుకున్నాడనేది ఇండస్ట్రీ టాక్. అంతేమరి ప్లానింగ్ లేటయితే ఫేట్.. రేట్ రెండూ మారిపోతాయి మరి!
ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా భరత్ అనే నేను షూటింగ్ లో కొరటాల శివ బిజీగా ఉన్నాడు. మరోవైపు రామ్ చరణ్ కూడా అచ్చ పల్లెటూరి ప్రేమకథ రంగస్థలం 1985 సినిమా చేస్తున్నాడు