టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. అమ్మడు కెరీర్ మొదట్లో కాస్త ఆచి తూచి అడుగు వేసినా.. ఆ తర్వాత తొందరపాటు తనంతో చేతులారా దగ్గరి కొచ్చిన అవకాశాల్ని నెట్టి వేస్తోందని గత కొంత కాలంగా టాక్ వినిపిస్తోంది. గత ఏడాది నాగార్జున తో తీసిన సోగ్గాడే చిన్ని నాయనా తర్వాత లావణ్య ఒక్క హిట్ కూడా అందుకోలేదు. వరుస అపజయాలతో సతమతమవుతోంది.
ఇప్పటివరకు నాలుగు ఫెయిల్యూర్స్ అందుకున్న అందాల రాక్షసి ఇక నుంచి కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలని ఆలోచిస్తోందట. అయితే అసలు విషయానికి వస్తే లావణ్య త్వరలోనే కొత్త ఇంట్లోకి అడుగులు వెయ్యాలని ఆలోచిస్తుందట. అంతే కాకుండా ఒక ప్రీమియర్ ఆడి కార్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధపడినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఒక ఫ్లాట్ ని కొనుగోలు చేసిన లావణ్య ఇక కొత్త బంగ్లా లోకి షిప్ట్ అవ్వాలని చూస్తోందట. మరి అమ్మడి కొత్త కారు కొత్త బంగ్లా ఎంతవరకు ఎంతవరకు కలిసొస్తాయో చూడాలి.
ఇక సినిమాల విషయానికి వస్తే నేను శైలజ తర్వాత కిషోర్ తిరుమల - రామ్ కాంబోలో తెరకెక్కుతున్న ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే తమిళ్ లో మాయావన్ అనే సినిమాలో నటిస్తోంది.