Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2017 11:20:58
facebook Twitter Googleplus
Photo

ప్రముఖ దర్శకుడు మణిరత్నంపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారో లైట్ మ్యాన్. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో సంచలనంగా మారాయి. తనకు కానీ మణిరత్నం న్యాయం చేయకుంటే ఆయన ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడో లైట్ మ్యాన్. గతంలో మణిరత్నం అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్యలతో కలిసి గురు అనే మూవీని చేయటం తెలిసిందే.

ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అన్నది తెలిసిందే. ఈ మూవీని షూట్ చేస్తున్న సమయంలో మణిమారన్ అనే లైట్ మ్యాన్ రక్తసంబంధిత వ్యాధికి గురయ్యాడు. దీంతో.. అతని వైద్య ఖర్చులకోసం మణిరత్నం కానీ.. ఈ సినిమా యూనిట్ కానీ ఎలాంటి సాయం చేయలేదు. దీంతో.. తనకు జరిగిన అన్యాయంపై అతడు కోర్టులో పోరాడాడు.

ఆయన పోరాటానికి తగ్గట్లే.. కోర్టులో ఆయనకు అనుకూలంగా నిర్ణయం వెలువడింది. కోర్టు తీర్పు ప్రకారం సంఘం తనకు రూ.2లక్షలు చెల్లించాల్సి ఉందని.. కానీ ఇవ్వటం లేదని.. డబ్బులు అడిగితే రూ.20 వేలు లంచం అడుగుతున్నట్లుగా పేర్కొన్నారు.

తన వైద్య ఖర్చుల్ని పదేళ్ల నుంచి తన కుటుంబ సభ్యులే భరిస్తున్నారని.. ఇప్పటికైనా తనకు న్యాయం చేయని పక్షంలో తాను మణిరత్నం ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని తేల్చి చెబుతున్నారు. లైట్ మ్యాన్ మణిమారన్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

,  ,  ,  ,  ,  ,  ,