Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Mar-2017 15:50:19
facebook Twitter Googleplus
Photo

ఏదైనా అవార్డులు ప్రకటించినపుడు ఎవరో ఒకరు అసంతృప్తి వ్యక్తం చేయడం మామూలే. నాకు రావాల్సింది ఎవరో తన్నుకుపోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు సినీ జనాలు. ఐతే తెలుగు హీరోయిన్ మాధవీలత ఎనిమిదేళ్ల కిందటి నంది అవార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుతోంది. 2008 నంది అవార్డుల్లో తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తోంది. ఆ ఏడాది ఉత్తమ నటిగా తనకు రావాల్సిన అవార్డును అరుంధతికి గాను అనుష్క ఎగరేసుకుపోయిందని.. కనీసం జ్యూరీ పురస్కారమైనా దక్కుతుందేమో అనుకుంటే అది స్వాతికి ఇచ్చేశారని మాధవి ఆవేదన వ్యక్తం చేసింది.

తాను కథానాయికగా పరిచయమైన నచ్చావులే సినిమాకు గాను తనకు అవార్డు వస్తుందని ఆశించానని.. నంది అవార్డుల తుది జాబితాలో కూడా తన పేరు ఉన్నట్లు సమాచారం వచ్చిందని.. ఐతే చివరికి తనకు అవార్డు మాత్రం ఇవ్వలేదని మాధవీలత తెలిపింది. ఈ విషయమై జ్యూరీ సభ్యుల్ని అడిగితే.. తాను సొంతంగా డబ్బింగ్ చెప్పుకోకపోవడం వల్లే అవార్డివ్వలేదని చెప్పారని.. ఐతే అనుష్క కూడా డబ్బింగ్ చెప్పుకోకున్నా ఆమెకు అవార్డు ఎలా ఇచ్చారో అని ఆమె సందేహం వ్యక్తం చేసింది. స్వాతి కంటే తానే తన తొలి సినిమాలో బాగా నటించానని.. కానీ అష్టాచెమ్మా సినిమాకు గాను ఆమెకే జ్యూరీ పురస్కారం దక్కిందని మాధవి పేర్కొంది. ఈ విషయమై తమ్మారెడ్డి భరద్వాజకు ఫోన్ చేస్తే.. నువ్వు చిన్న పిల్లవు నీకీ విషయాలన్నీ తెలియవు. ఇక్కడ చాలా రాజకీయాలుంటాయి. నా మీద చాలా ప్రెజర్ ఉంది అని ఆయనన్నట్లు మాధవీలత వెల్లడించింది.

,  ,  ,  ,  ,  ,  ,