ప్రస్తుతం 'ముకుంద' చిత్రం ఫినిషింగ్ పనుల్లో బిజీగా వున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయనున్నాడు. ఈ ప్రాజక్టుకు సంబంధించి మహేష్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. 'ముకుంద' రిలీజ్ కాగానే శ్రీకాంత్ ఈ సినిమా స్క్రిప్టు పని మొదలు పెడతాడని, ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించే ఈ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభమవుతుందనీ అంటున్నారు. అప్పటికి కొరటాల శివతో తాను చేస్తున్న చిత్రాన్ని మహేష్ పూర్తి చేస్తాడు. దీనికోసం 'బ్రహ్మోత్సవం' అనే టైటిల్ ని దర్శకుడు అనుకుంటున్నాడట. గతంలో మహేష్ తో కలసి శ్రీకాంత్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' హిట్ చిత్రాన్ని రూపొందించిన సంగతి విదితమే
maheshbabu, srikanthaddala, brahmotsavam, newmovie, tollywood,