Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Nov-2017 11:09:32
facebook Twitter Googleplus
Photo

మూడేళ్ల నంది అవార్డులు అనౌన్స్ చేసిన క్షణం నుంచే వివాదాలు మొదలయ్యాయి. అవార్డు ఎందుకు వచ్చిందనే దానికంటే ఎందుకు రాలేదన్న పాయింట్ పై డిస్కషన్ మొదలై అది రచ్చగా మారిపోయింది. చివరకు ఈ వివాదం కులాలు.. వర్గాలు.. ప్రాంతాల స్ఠాయికి వెళ్లిపోయింది. ఈ వివాదంపై కొంతమంది మాట్లాడుతుంటే చాలామంది మనకెందుకులే అని సైలెంట్ గా ఉండిపోయారు. అవార్డుకు ఎంపికైన వారు దీనిపై స్పందించడమే లేదు.

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి మాత్రం తనకు నంది అవార్డు లభించడంపై సంతోషం వ్యక్తం చేసింది. చందమామ కథలు సినిమాలో ఆమె చేసిన పాత్రకు ఉత్తమ నటి అవార్డు లభించింది. ఈ అవార్డు లభించడం తెలుగు అమ్మాయిగా తనకెంతో గర్వంగా ఉందని అవార్డు ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి థ్యాంక్స్ కూడా చెప్పింది. ఈసారి అవార్డుకు ఎంపికైన వారిలో స్టార్ కిడ్స్ కూడా ఉన్నారు. ప్రిన్స్ మహేష్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి వారంతా తమకు లభించిన అవార్డు గురించి ఇంతవరకు పెదవి విప్పలేదు. ఫస్ట్ దీనిపట్ల పాజిటివ్ రెస్పాండ్ అయిన స్టార్ కిడ్ లక్ష్మియే. దీనిని బట్టి ప్రస్తుతం వస్తున్నకాంట్రవర్సీలతో తనకు పెద్దగా అభ్యంతరం ఏమీ లేదని అనుకోవచ్చు.

మంచు లక్ష్మి చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమెకు నంది అవార్డు రావడం ఇది రెండోసారి. ఆమె తెరంగేట్రం చేసిన అనగనగా ఒక ధీరుడు సినిమాకు ఆమెకు ఉత్తమ ప్రతినాయకురాలి అవార్డు లభించింది.

,  ,  ,  ,  ,  ,