గత చిత్రాలకు భిన్నంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఇప్పుడు తన తాజా చిత్రం షూటింగ్ పూర్తి చేశాడు. స్లోగా... ఎక్కువ వర్కింగ్ డేస్ తీసుకుని షూటింగ్ చేస్తాడన్న పేరున్న మణి, తన తాజా చిత్రాన్ని అతి తక్కువ సమయంలో కంప్లీట్ చేసి, తానూ ఫాస్ట్ గా తీయగలనని ప్రూవ్ చేశాడు. మమ్ముట్టి తనయుడు దుల్ఖర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి తమిళ, మలయాళ వెర్షన్లకు 'ఓకే కన్మణి' అనే టైటిల్ నిర్ణయించగా, తెలుగు వెర్షన్ కి 'ఓకే బంగారం' పేరును ఖరారు చేసినట్టు చెబుతున్నారు. పీసీ శ్రీరాం ఛాయాగ్రహణం, ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ ప్రేమ కథా చిత్రానికి పెద్ద ప్లస్సవుతాయి!
maniratnam, okbangaram, newmovie, kollywood, news, nityamenon, dulkhersalman,