"మణిరత్నం గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో విడుదల చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది" అంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. వరుస అపజయాల తర్వాత మణిరత్నం తమిళంలో ప్రస్తుతం 'ఓకే కన్మణి' పేరిట ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ హక్కులను దిల్ రాజు తీసుకున్నారు. ఈ చిత్రానికి తెలుగులో 'ఓకే బంగారం' అనే పేరు ఖరారు చేసినట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ, ఏప్రిల్ నెలలో దీనిని రిలీజ్ చేస్తామనీ ఆయన తెలిపారు. ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో దుల్ఖర్ సల్మాన్, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా నటించారు.
maniratnam, okbangaram, dilraju, tollywood, news, april,