తెలుగు ప్రేక్షకులు శర్వానంద్ విశ్వరూపం చూస్తారని దర్శకుడు దాసరి మారుతి అన్నాడు. ఈ సినిమాలో కొత్త శర్వా కనిపిస్తాడని అతనన్నాడు. తాను అందరు హీరోల గురించి.. అన్ని సినిమాల గురించి ఇలా మాట్లాడనని.. ఇంతకుముందు భలే భలే మగాడివోయ్ సినిమా నానికి కొత్తగా ఉంటుందని అతడికో మేకోవర్ అవుతుందని చెప్పానని.. అలాగే మహానుభావుడు కూడా శర్వాకు చాలా కొత్త సినిమా అవుతుందని భావిస్తున్నట్లు చెప్పాడు మారుతి. మహానుభావుడు షూటింగ్ సందర్భంగా శర్వా నటన చూసి ఆశ్చర్యపోయి.. ఇది నీ విశ్వరూపమే అని శర్వాతో తాను చెప్పానని.. ఇప్పుడు ప్రేక్షకులకు కూడా అదే మాట చెబుతున్నానని మారుతి అన్నాడు.
భలే భలే మగాడివోయ్ తో యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ.. ప్రమోద్ తనకు మరపురాని సినిమా అందించారని.. వాళ్లిద్దరూ తనకు లైఫ్ టైం ఫ్రెండ్స్ అయిపోయారని.. మహానుభావుడు కూడా ఈ బేనర్లో తనకు మరో మరపు రాని సినిమా అవుతుందని మారుతి చెప్పాడు. మహానుభావుడు చాలా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా అని.. ఇలాంటి సినిమాలు ఎప్పుడూ రావని.. ఇందులో ఎమోషన్లు కూడా చాలా బాగుంటాయని.. కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని.. దసరా సీజన్లో తెలుగు ప్రేక్షకులకు ఇది సరైన సినిమా అని.. అందరూ తప్పకుండా ఈ సినిమా చూడాలని మారుతి కోరాడు.