Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Dec-2016 13:29:57
facebook Twitter Googleplus
Photo

నందమూరి ఫ్యామిలీ హీరోల్లో విబేధాలు అంటూ పుంఖానుపుంఖాలుగా కథలు వస్తాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ- జూనియర్ ఎన్టీఆర్ లకు అంతగా పడదంటారు. హరికృష్ణకు కూడా బాలయ్య దూరంగానే ఉంటున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. వీటిలో నిజానిజాల సంగతి చెప్పలేం కానీ.. రీసెంట్ గా గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదల అయినప్పుడు.. జూనియర్ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లు ట్విట్టర్ సాక్షిగా ప్రశంసలు కురిపించారు. శాతకర్ణి అదరహో.. బాలయ్య అద్భుతంగా ఉన్నాడంటూ కీర్తించారు. ట్రైలర్ ను కూడా పొగిడేశారు.

దీంతో నందమూరి హీరోల మధ్య విబేధాలు చెక్ పడ్డట్లే అనుకున్నారు అభిమానులు. కానీ నిన్న జరిగిన గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ కానీ.. కళ్యాణ్ రామ్ కానీ కనిపించలేదు. ఇందుకు కారణం.. వారికి ఆహ్వానం అందకపోవడమే అని తెలుస్తోంది. ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఓ డిజిటల్ ఇన్విటేషన్ ను 100 ప్రింట్స్ వేయించి.. వందమంది విశిష్ట అతిథులకు ఇస్తున్నట్లు క్రిష్ టీం స్వయంగా చెప్పింది. అయినా ఈ నందమూరి హీరోలకు మాత్రం ఇన్విటేషన్ మాత్రం అందలేదా? ఒకవేళ ఇన్విటేషన్ అందితే వీరికి రావడం కుదర్లేదా?? తెలుగువాడి గొప్పదనం గురించి చెప్పే ప్రతిష్టాత్మక చిత్రమైన గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో వేడుకకు వీరు హాజరు అయ్యుంటే బాగుండేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

,  ,  ,  ,  ,  ,