Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Oct-2017 11:42:56
facebook Twitter Googleplus
Photo

సినిమాలో కథనంతో మాటలతో ఆకట్టుకున్న పూరి జగన్.. అపజయాన్ని పట్టించుకోకుండా తన స్టైల్ లో తాను సినిమాలను చేస్తున్నాడు. చివరగా భారీ అంచనాల మధ్య విడుదలైన బాలయ్య పైసా వసూల్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నందమూరి అభిమానులైతే చాలా నిరాశ చెందారు. కానీ బాలయ్య మాత్రం మరో సినిమాను పూరితో చేస్తానని ముందే చెప్పాడు. సినిమా రిజల్ట్ తర్వాత బాలయ్య మళ్లీ పూరితో చెయ్యడానికి ఆసక్తి చూపడం లేదని ఆయనను దూరం పెట్టారని అనేక రూమర్స్ వచ్చాయి.

కానీ బాలయ్య అలాంటి ఆలోచనతో లేరని రీసెంట్ గా జరిగిన ఒక మ్యాటర్ గురించి తెలిస్తే ఎవరికైనా అర్ధమవుతోంది. ప్రస్తుతం పురి జగన్నాథ్ తన కొడుకుతో మెహబూబా సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం ఉదయం ఆ సినిమా షూటింగ్ హిమాచల్ ప్రదేశ్ లో కరెక్ట్ గా ముహూర్తం ప్రకారం 8:20 గంటలకు స్టార్ అయ్యిందట. అయితే ఈ సినిమాకు అదే టైమ్ కి స్టార్ట్ చేయమని చెప్పింది బాలయ్య గారేనట. ఆయన రెగ్యులర్ గా కలిసే ఒక ఆస్త్రాలజీ గురువు ద్వారా ఆ ముహూర్తం పెట్టించినట్లు తెలుస్తోంది.

దీంతో పూరి కూడా అదే సమయంలో సినిమా ఫస్ట్ షాట్ ని తీసాడట. తన కొడుకు కోసం బాలయ్య ఆ విధంగా కేర్ తీసుకోవడం పూరి చాలా ఆనందపడిపోయారట. ఇక సినిమా విషయానికి వస్తే ఇండియా - పాక్ యుద్ధ సమయంలో ఒక ముస్లిమ్ అమ్మాయి - హిందు అబ్బాయి మధ్య సాగిన ప్రేమను పురిజగన్నాథ్ చూపించబోతున్నాడు.

,  ,  ,  ,  ,