Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Nov-2016 13:44:22
facebook Twitter Googleplus
Photo

సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి ముందు అనుకున్న నిర్మాత వేరు. కానీ మధ్యలో మిర్యాల రవీందర్ రెడ్డి అనే నిర్మాత పేరు తెరమీదికి వచ్చింది. ఈ సినిమా మీద ఈ కొత్త నిర్మాత భారీ పెట్టుబడే పెట్టినట్లుగా వార్తలొస్తున్నాయి. మరోవైపు అభిషేక్ పిక్చర్స్ వైదొలిగాక బోయపాటి శ్రీను-బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాను టేకప్ చేసింది కూడా మిర్యాల రవీందర్ రెడ్డే. ఇంకా రెండు మూడు భారీ ప్రాజెక్టులకు సన్నాహాలు చేసుకుంటున్నాడు రవీందర్ రెడ్డి. నిర్మాతగా తన తొలి సినిమా ?సాహసం శ్వాసగా సాగిపో? ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తన ప్రస్థానం.. భవిష్యత్ ప్రణాళికల గురించి మీడియాతో పంచుకున్నాడు రవీందర్ రెడ్డి. అతనేమంటున్నాడంటే..

??సాహసం శ్వాసగా సాగిపో సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా కొన్ని సాంకేతిక కారణాల కారణంగా కొంత ఆలస్యమైన మాట నిజమే. కానీ మా సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. తప్పకుండా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ప్రథమార్ధం అంతా అందమైన ప్రేమకథ అలరిస్తుంది. ద్వితీయార్ధంలో యాక్షన్ పార్ట్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. నాగచైతన్య ?ప్రేమమ్? లాంటి హిట్ కొట్టాక ?సాహసం శ్వాసగా సాగిపో? సినిమా విడుదలవుతుండటం మంచిదైంది. మా సినిమాకు ఆ విజయం మంచి చేస్తుంది. ?డిక్టేటర్? డైరెక్టర్ శ్రీవాస్ నాకు మంచి మిత్రుడు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో కోన వెంకట్ గారితో పరిచయమైంది. ఆయనే ?సాహసం శ్వాసగా సాగిపో? సినిమా గురించి చెప్పారు. అలా అనుకోకుండా ఈ ప్రాజెక్టులోకి వచ్చాను. నేను దర్శకుడు కావాలన్న లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చాను. సహాయ దర్శకుడిగానూ పని చేసి.. ఆ తర్వాత నిర్మాత అయ్యాను. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఉంది. అవకాశమిస్తే తప్పకుండా చేస్తాను. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి గారి దర్శకత్వంలో చేస్తున్న సినిమా నవంబరు 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఫిభ్రవరిలో గోపీచంద్ తో సినిమా ఉంటుంది. విజయ్ ఆంటోనీ తమిళ సినిమా ?యెమన్?ను తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ఈట్టి అనే తమిళ సినిమా రీమేక్ హక్కులు కూడా తీసుకున్నాం. దాన్ని రీమేక్ చేద్దామా.. అనువాదం చేద్దామా అన్నది ఆలోచిస్తున్నాం? అని రవీందర్ రెడ్డి అన్నాడు.

,  ,  ,  ,