Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2015 12:27:53
facebook Twitter Googleplus
Photo

మెగా ఫ్యామిలీ లేటెస్ట్ హీరో వరుణ్ తేజ్ సరసన కొత్త కథానాయిక నటించనుంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'కంచె' చిత్రాన్ని చేస్తున్న వరుణ్, త్వరలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో ముంబయ్ కి చెందిన దిశా పథాని కథానాయికగా ఎంపికైంది. సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంచితే, ఇప్పటికే పలు ఈవెంట్స్ లో అందాలభామగా ఎంపికైన దిశా, ప్రస్తుతం బాలీవుడ్ లో 'నో సెక్స్ ప్లీజ్, వీ ఆర్ ఇండియన్స్' అనే అడల్ట్ కామెడీ సినిమాలో నటిస్తోంది.

,  ,  ,  ,  ,  ,