సౌతిండియన్ సినిమాలో పాపులర్ డైరెక్టర్స్లో ఒకరైన దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. గత నెల్లో సెట్స్పైకి వెళ్ళిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక మహేష్తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ, మురుగదాస్, మహేష్పై ప్రశంసలు కురిపించారు. మహేష్ చాలా అంకితభావంతో పనిచేస్తారని, ప్రిన్స్ అన్న పేరుకు తగ్గట్టే ఆయన హుందాగా నడుచుకుంటారని మురుగదాస్ అన్నారు.
?ఒక షాట్ పూర్తి కాగానే మహేష్ నన్ను చూస్తారు. నా ముఖంలో ఏమాత్రం అసంతృప్తి కనబడినట్లు అనిపించినా, ఆయనే స్వయంగా ఇంకో టేక్కి వెళదాం అనేస్తూంటారు. చెప్పే ప్రతీ విషయాన్నీ చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు? అని మహేష్తో పనిచేయడం ఎలా ఉంది? అని ఓ తమిళ పత్రిక అడిగిన ప్రశ్నకు మురుగదాస్ పై సమాధానం ఇచ్చారు. ఓ సోషల్ మెసేజ్ ఉన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు.