Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Aug-2017 13:04:11
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో సౌత్ భామల కన్న నార్త్ భామల హవా ఎక్కువగా ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. గ్లామర్ పాత్రలను పోషిస్తూనే అచ్చ తెలుగమ్మాయిల్లా చాలా ఆకట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు అదే తరహాలో బాలకృష్ణ తో ఓ ఢిల్లీ భామ అల్లరి చేయనుందట. అచ్చ తెలుగు అమ్మాయిలా ఒక టీనేజ్ యువతిగా హీరోయిన్ చెల్లెలిగా ముస్కాన్ సేతి నటించనుందట.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సరికొత్త కథాంశంతో వస్తున్న "పైసా వసూల్ చిత్రంలో ముస్కాన్ సేతి హీరోయిన్ చెల్లెలిగా నటిస్తోంది. ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రియా శరన్ నటిస్తోంది. కాని మ్యాటర్ ఏంటంటే.. ముస్కానే మెయిన్ లీడ్ అంటూ ఛార్మి ఆల్రెడీ ప్రచారం చేస్తోంది. అయితే రీసెంట్ ముస్కాన్ ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది ముస్కాన్. పూరి జగన్నాథ్ ఆడిషన్ నిర్వహించినపుడు కొన్ని కఠినతరమైన సీన్స్ ఇచ్చారట. దీంతో ముస్కాన్ చాలా కష్టపడి పూరీని మెప్పించి సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. అయితే ఈ సినిమా షూటింగ్ లో తనకు జరిగిన కొన్ని అనుభవాలను గురించి ఈ సుందరి బయటపెట్టింది. హీరో నందమూరి బాలకృష్ణ గారితో కొన్ని మధురమైన క్షణాలను ఎదుర్కొందట.

ఆయన నన్ను చాలా ఆటపట్టించే వారిని చెబుతూ.. సెట్స్ లో కొంచెం అల్లరి చేసేవారని చెప్పుకొచ్చింది. అలాగే బాలయ్య చాలా మంచి నటుడని వ్యక్తిత్వం లో కూడా చాలా మంచివారని పొగిడింది. అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాను చాలా బాగా చిత్రీకరించారని చెప్పింది ముస్కాన్. అలాగే చిత్రంలో ఈ అమ్మడి పాత్ర చాలా బావుందని చెబుతూ.. సినిమాలో అనుకోని ట్విస్ట్ లు ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంటాయని వివరించింది. ఇక బాలయ్య సినిమా ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు పెంచింది.

,  ,  ,  ,