అఖిల్ సినిమా కథ ఏవిటనే విషయాన్ని పక్కనపెడితే, ఖర్చు మాత్రం అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తోంది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి, షూటింగ్ అంతా విదేశాల్లోనే ఎక్కువగా జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో .. ఈ సినిమా బడ్జెట్ గా 30 కోట్లవరకూ ఖర్చు చేయాలని అనుకుంటే, అది కాస్తా దాటిపోయిందట. అయినా నితిన్ వెనకడుగు వేయకుండా ఖర్చుచేస్తూ వెళుతున్నాడు.
దాంతో నాగార్జున .. నితిన్ తో ఈ విషయాన్ని గురించి మాట్లాడాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఖర్చు విషయంలో కాస్త దూకుడు గా వున్న నితిన్ తో .. ఆచి తూచి వ్యవహరించమని నాగార్జున చెప్పాడట. జరగబోయే బిజినెస్ ను కూడా దృష్టిలో పెట్టుకుని, ఖర్చు విషయంలో జాగ్రత్తలు పాటించమని సూచించాడు. కథానాయకుడిగానే కాదు .. నిర్మాతగా కూడా నాగార్జునకి మంచి అనుభవం వుంది. నిర్మాతలు ఇబ్బందుల్లో పడకూడదనే స్వభావం వుంది. అందువల్లనే నాగార్జున ఇలా నితిన్ కి కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది.