Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Feb-2017 15:23:41
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ ఓం నమో వేంకటేశాయ. శ్రీనివాసుడు అపర భక్తుడైన హథీరాం బాబాజీ పాత్రలో నాగ్ నట విశ్వరూపం చూపించబోతున్నారు. ఈ నెల 10న ఓం నమో వేంకటేశాయ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. రిలీజ్ కి ఇంకా వారం రోజుల టైం మాత్రమే ఉండగా.. ఇప్పుడు నాగ్ ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

సినిమా రిలీజ్ కి వారం ముందంటే.. బోలెడన్ని ప్రమోషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ టూర్ విషయంలో ముందే ప్లానింగ్ తో ఉన్న నాగ్.. దాదాపు అన్ని ఛానల్స్ కు.. వెబ్.. ప్రింట్ మీడియాలకు ఇంటర్వ్యూల తతంగం పూర్తి చేసేశారు. కొన్ని ఇప్పటికే టెలికాస్ట్ కాగా.. మరికొన్ని రిలీజ్ కి ముందు ప్రసారం కానున్నాయి. ఇదంతా ప్రీ ప్లాన్ గా ముందుగానే పూర్తి చేశారట నాగార్జున. ఇందుకు కారణం.. ఈ వారం అంతా రోమ్ నగరానికి నాగ్ వెళ్లనుండడమే అని తెలుస్తోంది.

అఖిల్-శ్రేయా భూపాల్ ల పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ గా రోమ్ లో ఫిక్స్ చేశారనే టాక్ ఉంది. ఆ పెళ్లి పనుల కోసమే ఇప్పుడు నాగార్జున అక్కడికి వెళుతున్నారట. అలాగని సినిమా ప్రమోషన్స్ వదిలేసి వెళ్లాడనే మాట రాకుండా ఉండేందుకు.. ముందుగానే ఆ తతంగాన్ని కంప్లీట్ చేశారని తెలుస్తోంది. అయితే.. సరిగ్గా ఓం నమో వెంకటేశాయ మూవీ రిలీజ్ కి ముందు రోజుకి.. నాగ్ హైద్రాబాద్ ల్యాండ్ అయ్యేలా ఈ టూర్ ప్లాన్ చేయడం విశేషం. కాబట్టి.. నాగ్ బాబా కొత్త సినిమా ప్రమోషన్స్ కి వచ్చిన ఇబ్బందేమీ లేనట్లే.

,  ,  ,  ,  ,  ,