నాగార్జున, కార్తి హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ చిత్రం తదుపరి షెడ్యూలును దుబాయ్ లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి అక్కడ జరిగే షూటింగులో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. 'ఎవడు' తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటి వరకు చెన్నయ్, హైదరాబాదులలో రెండు షెడ్యూళ్ళను జరుపుకుంది. 'పీవీపీ సినిమా' సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా ఒక కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే!
nagarjuna, karthi, tamannaha, pvp, news,