అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కుమారుడు నాగచైతన్య నటించిన రా రండోయ్ వేడుక చూద్దాం మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమాపైనే దృష్టి పెట్టిన నాగ్.. కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా అన్నాడు.
అంతే కాదు.. ఓ ఇంటర్వ్యూలో అయితే తాము తీసిన సినిమా తమకే నచ్చకపోతే అసలు రిలీజ్ చేయబోనని కూడా చెప్పేశాడు నాగ్. ఇప్పుడు ఓ సినిమాపై అనుమానాలు రేకెత్తించేలా నాగ్ స్పందించడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోతోంది. ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది-2 చిత్రంలో నటిస్తున్నాడు నాగార్జున. ఈ మూవీకి సంబంధించిన డీటైల్స్ అడిగినప్పుడే జనాలకు సందేహం రేకెత్తించే రియాక్షన్ వచ్చింది. సినిమా ఓకే కానీ అంటూ స్పందించిన నాగ్.. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ పై అప్ డేట్ ఇచ్చాడు.
రాజు గారి గది2 చిత్రానికి ఇంకా పది రోజుల షూటింగ్ పార్ట్ పెండింగ్ ఉంది. సమంత షూటింగ్ పార్ట్ అయిపోయింది కూడా. ఇప్పటివరకూ తీసిన సన్నివేశాలను ఓసారి చూసుకుని.. అప్పుడు మిగిలిన భాగం షూటింగ్ పై డిసైడ్ చేస్తాం అన్నాడు నాగార్జున.