మహేష్ బాబు భార్య, ఒకప్పటి మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. 2005లో బ్రైడ్ అండ్ ప్రిజుడిస్ అనే ఆంగ్ల చిత్రంలో నటించిన ఆమె ఆ తర్వాత వేరే సినిమాల్లో కనిపించలేదు. ఇన్నాళ్లు మహేష్ బాబుకు సంబందించిన వ్యవహారాలూ, ఇతర వ్యాపార విషయాలు, కుటుంబ పరమైన విషయాలను చూసుకుంటూ వచ్చిన ఆమె ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆమె ప్రస్తుతం ఒక మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. కానీ ఆ చిత్రం ఎవరిదీ, ఏ భాషలో రూపొందుతోంది, ఎవరెవరు నటిస్తున్నారు, ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది లాంటి వివరాలేమీ తెలుపలేదు. దీంతో అందరిలోనూ ఇంతకీ ఆమె చేస్తున్న ప్రాజెక్ట్ ఏమిటనే ఆసక్తి రేకెత్తుతోంది.