వయసు పెరుగుతున్నా, డిమాండ్ మాత్రం తగ్గని నయనతార తాజాగా పారితోషికం విషయంలో వార్తల్లో నిలిచింది. తమిళనాట ఎడాపెడా సినిమాలు చేసేస్తూ బిజీగా వున్న ఈ ముద్దుగుమ్మను చిరంజీవి నటించే 150వ చిత్రానికి ప్రధాన కథానాయికగా అడిగారట. అందుకు వెంటనే అంగీకరించిన నయన పారితోషికం దగ్గర బాంబు పేల్చింది. మూడు కోట్లు ఇస్తేనే అందులో నటిస్తానని మొహమాటం లేకుండా చెప్పేసిందనీ, దాంతో సదరు చిత్ర దర్శక నిర్మాతలు షాక్ తిన్నారని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. మరి, ఈ విషయంలో వాస్తవాలు ఏమిటన్నది తెలియాల్సివుంది.
ఇదిలా వుండగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్, బండ్ల గణేష్ కలసి సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాలో రెండో కథానాయికగా అంజలి నటిస్తుందని అంటున్నారు. చిరంజీవి జన్మదినమైన ఆగష్టు 22న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించి, సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ నిర్వహిస్తారు.