దిగ్గజ నిర్మాత డి. రామానాయుడు 80వ పుట్టిన రోజు సందర్భంగా.. దగ్గుబాటి కుటుంబం అంతా ఆయనకు నివాళులు అర్పించింది. ఆయన స్మృతిగా ప్రత్యేక ఫలకాన్ని కూడా ఏర్పాటు చేసి.. తమ మార్గదర్శకుడిని ఘనంగా స్మరించుకుంది. ఈ కార్యక్రమానికి దగ్గుబాటి కుటుంబ సభ్యులు - సన్నిహితులు అందరూ వచ్చినా.. నాగచైతన్య మాత్రం కనిపించలేదు. షూటింగ్ కోసం వేరే ఎక్కడో ఉండి రాలేకపోతే అనుకోవచ్చు.. నిజానికి చైతు హైద్రాబాద్ లో ఉండి కూడా ఈ ఈవెంట్ ని మిస్ చేయడానికి కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.
గత కొంతకాలంగా చైతు లవ్ ఎఫైర్ గురించిన న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సమంతతో నాగచైతన్య ప్రేమాయణం గురించి డిస్కషన్స్ పెరిగాయి. తన లవర్ చైతునే అని చెప్పకపోయినా.. తనే అన్నట్లుగా ఓసారి లీడ్ ఇచ్చింది సమంత. ఆ తర్వాత ప్లీజ్ ఆ క్వశ్చన్ అడగద్దని ఎన్నిసార్లు చెప్పినా.. ఆమె ఎక్కడ కనిపించినా.. లవ్ ఎఫైర్ గురించి మాట్లాడక తప్పలేదు.
ఇప్పుడు నాగచైతన్య కనిపించినా మీడియా జనాలు ఇదే తరహా ప్రశ్నలు అడిగే అవకాశం ఉండడంతో.. ఉద్దేశ్యపూర్వకంగానే తాతయ్య రామానాయుడు బర్త్ డే ఈవెంట్ ను మిస్ చేశాడట చైతు. అయితే.. అంతర్గతంగా అందుతున్న సమాచారం ప్రకారం.. చైతు తల్లి ఇప్పటికే చైతు లవ్ స్టోరీపై ఓ డెసిషన్ తీసుకున్నారట. చైతు-సమంతల పెళ్లికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్నది లేటెస్ట్ టాక్.