గతంలోలా ఇప్పుడు నిర్మాతలు మహేష్ బాబును ఎప్పుడు పడితే అప్పుడు అపాయింట్ మెంట్ లేకుండా కలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే, ఇప్పుడు వాళ్లింటి వద్ద రూల్స్ అన్నీ మారిపోయాయట. గతంలో మహేష్ తో ఏ కాస్త పరిచయం వున్నా వాళ్ళయినా సరాసరి వచ్చేసి, కథలు చెప్పేసేవారు. అయితే, 'ఆగడు' చిత్రం అపజయం పాలవడంతో మహేష్ భార్య నమ్రత చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట. తన అనుమతి లేనిదే ఎవర్నీ ఇంట్లోకి పంపించవద్దని ఆమె సెక్యూరిటీకి కచ్చితమైన ఆదేశాలు జారీ చేసిందని అంటున్నారు. అలాగే, షూటింగులకు, ఇంటికి వచ్చి డిస్టర్బ్ చేసే 'భజన'మండలిని కూడా మహేష్ ఇప్పుడు దూరంగా పెడుతున్నాడట. ఇదంతా నమ్రత ఇచ్చిన సలహా కారణంగానే జరిగిందని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.
maheshbabu, newrules, namratha, tollywood,