కొత్తవారిని ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతో మొదట్నుంచీ సినిమాలు నిర్మిస్తూ వస్తోన్న దర్శకుడు మారుతి, తాజాగా ప్రముఖ నిర్మాత దిల్రాజు, శ్రేయాస్ శ్రీనివాస్లతో కలిసి ?రోజులు మారాయి? అనే కామెడీ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా టైమ్ పాస్ కామెడీ ఎంటర్టైనర్గా పేరు తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్నే వసూలు చేస్తోంది. ముఖ్యంగా ఫస్టాఫ్కు మంచి రెస్పాన్స్ వస్తుండగా, సెకండాఫ్లో కాస్త కామెడీ తగ్గిందని వినిపించింది.
ఇక ఈ నేపథ్యంలోనే ?రోజులు మారాయి? టీమ్, ఎడిటింగ్ దశలో సినిమా నుంచి తీసేసిన కొన్ని సన్నివేశాలను ఈ శుక్రవారం నుంచి జత చేస్తోంది. 8 నిమిషాల నిడివి గల ఈ సన్నివేశాల్లో జబర్దస్త్ ఫేం అప్పారావు నేపథ్యంలో వచ్చే కామెడీ అందరినీ అలరిస్తుందని టీమ్ తెలిపింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోన్న సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో భాగంగా నిర్మాతలు కొత్త సన్నివేశాలను జత చేస్తున్నట్లు తెలిపారు. చేతన్, పార్వతీశం, తేజస్వి, కృతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మురళి దర్శకత్వం వహించారు.