Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Sep-2015 13:34:03
facebook Twitter Googleplus
Photo

మూడు వరుస విజయాలతో జోరుమీదున్నాడు నిఖిల్. ఆయనతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. నిఖిల్ కూడా ఒక సినిమా పూర్తయ్యేలోపు మరో సినిమాని లైన్ లో పెడుతూ దూకుడు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం `శంకరాభరణం`లో నటిస్తున్న ఆయన తదుపరి టైగర్ దర్శకుడితో ఓ సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడని సమాచారం. సందీప్ కిషన్ రాహుల్ రవీంద్రన్ లతో `టైగర్` అనే చిత్రాన్ని తెరకెక్కించిన వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్ తదుపరి సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ శిష్యుడే వి.ఐ.ఆనంద్. ఈయన చెప్పిన ఓ ప్రేమకథ నిఖిల్ కి బాగా నచ్చిందట. దీంతో వెంటనే సినిమా చేస్తానని మాటిచ్చాడట. త్వరలోనే ఈ సినిమా కొబ్బరికాయ కొట్టుకొనే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. లవ్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఆ కథలో ఉంటాయని సమాచారం.

నిఖిల్ ఇటీవల కాలంలో ఏ సినిమా చేసినా అందులో థ్రిల్లింగ్ అంశాలు ఉండేలా చూసుకొంటున్నాడు. `స్వామి రారా` `కార్తికేయ` `సూర్య వర్సెస్ సూర్య` ఈ మూడు చిత్రాలు కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపుదిద్దుకొన్నవే. ఇప్పుడు తెరకెక్కుతున్న `శంకరాభరణం` కూడా ఓ క్రైమ్ థ్రిల్లరే. నిఖిల్ అభిరుచి తెలుసుకొనే వీఐ ఆనంద్ ఓ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ సిద్ధం చేసుకొని వినిపించినట్టు తెలుస్తోంది. వీఐ ఆనంద్ తీసిన `టైగర్` మంచి సినిమా అన్న ప్రశంసలు పొందింది. పరువు హత్య అనే ఓ నావెల్ పాయింట్ ని తీసుకొని ఆ సినిమాని తెరకెక్కించాడు. తొలి ప్రయత్నంలోనే మంచి టేస్టున్న దర్శకుడు అనిపించుకొన్నాడు. మరి తదుపరి నిఖిల్ తో చేయనున్న చిత్రంతో ఎలాంటి ఫలితాన్నిస సొంతం చేసుకొంటాడో చూడాలి.

,  ,  ,