సౌతిండియన్ సినిమాలో నటి నిత్యా మీనన్కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళ, మళయాల భాషల్లో అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్న నిత్యా, ఈమధ్యే వచ్చిన జనతా గ్యారెజ్, ఇంకొక్కడు తర్వాత మరో క్రేజీ ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వెంకటేష్ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించే సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్గా నటించనున్నారు. ఈ విషయాన్ని నిత్యా మీనన్ స్వయంగా ప్రకటిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
?నేను శైలజ? సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కిషోర్ తిరుమల, వెంకటేష్తో ఓ కామెడీ సినిమా చేయనున్నారట. ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి, ఓ యువతికి మధ్యన జరిగే సరికొత్త ప్రేమకథతో ఈ కామెడీ తెరకెక్కనుందని సమాచారం. వెంకీ ప్రస్తుతం హీరోగా నటిస్తోన్న సాలా ఖదూస్ తెలుగు రీమేక్ పూర్తవ్వగానే కిషోర్ తిరుమల సినిమా సెట్స్పైకి వెళ్ళనుంది.