ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ?జనతా గ్యారేజ్?. సమంత, నిత్యామీనన్ నాయికలు. ?మిర్చి?, ?శ్రీమంతుడు? చిత్రాలతో వరుస విజయాన్ని సొంతం చేసుకున్న కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీస్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మాతలు. ఈ సినిమా కోసం హైదరాబాద్లోని సారథి స్టూడియోలో భారీ గ్యారేజ్ సెట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే సెట్ పక్కన ఓ రిచ్ హౌస్ను రూపొందించారు. అందులో మోహన్లాల్ గృహానికి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ ??జనతా గ్యారేజ్లో ఈ నెల 14 నుంచి 20 వరకు ఓ ఫైట్ తీస్తాం. గ్యారేజ్ సెట్లో ఇంకో మూడు, నాలుగు రోజుల పని మాత్రమే బ్యాలన్స్ ఉంది. గ్యారేజ్ పక్కనే వేసిన రిచ్ హౌస్లో మాత్రం మోహన్ లాల్ ఇంటికి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరిస్తాం. మే మొదటి వారం నుంచి కేరళలో 15 రోజులు ఓ షెడ్యూల్ చేస్తాం. అక్కడ హీరో, హీరోయిన్లపై వారం రోజులు ఓ పాటను ప్లాన్ చేశాం. ఇంకో వారం రోజుల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉంటుంది?? అని చిత్ర వర్గాలు వెల్లడించాయి. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆగస్టు 12న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు సినిమా ప్రారంభోత్సవం రోజు నిర్మాతలు ప్రకటించారు.
Share !