ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ?జనతా గ్యారేజ్?. మోహన్లాల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సమంత, నిత్యామేనన్ కథానాయికలు. రేపు (సెప్టెంబర్ ఒకటిన) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఐతే ఈ లోక ప్రిమియర్ షోలు పడిపోయాయి. ఇప్పటికే యూస్ లో చాలా మంది సినిమాని వీక్షించేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా బెనిఫిట్ షోలు మొదలయ్యాయి.
ఇప్పుడు ఎన్టీఆర్ కూడా కుటుంబ సమేతంగా ఈ సినిమా చూశేశారు. కొద్దిసేపటి క్రితమే ఎన్టీఆర్ తన తల్లి, భార్యతో కలిసి సినిమాని ప్రత్యేకంగా వీక్షించారు. ఆయన తో పాటు సినిమా చిత్ర యూనిట్ లోని ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఈ స్పెషల్ షో నీ వీక్షించారు. సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ మదర్ చాలా ఆనందం వ్యక్తం చేసినల్టు తెలిసింది. సినిమా చాలా బావుందని ఆమె కాంప్లీమెంట్ ఇచ్చారు.