రోజుకో దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ కు కథ చెప్పాడని తెగ రూమర్లు వస్తూనే ఉన్నాయి. మొన్నామధ్యన పూరి జగన్.. తరువాత అనిల్ రావిపూడి.. ఆ తరువాత వివి వినాయక్.. మరోసారి వక్కంతం వంశీ.. ఇప్పుడేమో కె.ఎస్.రవీంద్ర (బాబీ) అంటూ రూమర్లను వింటూనే ఉన్నాం. ఈ మొత్తం యవ్వారం చూస్తుంటే ఒక్క విషయం అర్ధమవుతోంది. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ స్టోరీ కోసం మనోడు వెతుకుతున్నాడు. అయితే జూనియర్ కు ఈ ఐడియా చెప్పక తప్పదు.
నిజానికి బ్లాక్ బస్టర్ స్టోరీ కోసం వెతకడం కష్టం.. కాని ఒక స్టోరీని వెతుక్కుని దానిని బ్లాక్ బస్టర్ చేయడం ఈజీ. ఇప్పుడు ఉన్నపలంగా జనతా గ్యారేజ్ లాంటి కథ కావాలి అంటే ఎలా? జనతా గ్యారేజ్ 2 తీసుకోవాల్సి వస్తుంది. అదే కనుక ఒక సింపుల్ సామాజిక స్పృహ ఉన్న కథా వస్తువు ఏదైనా తీసుకుని దానికి అన్ని హంగులూ అద్దితే ఆటోమ్యాటిక్ గా అదే బ్లాక్ బస్టర్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు జూనియర్ కు చెప్పే కథలన్నీ.. మన దర్శకులు కనీసం మినిమం వర్కవుట్ అయ్యే కంటెంట్ కూడా లేకుండా చెబుతున్నారంటారా? ఆ విషయం మాత్రం మనం చెప్పలేం కాని.. తారక్ మాత్రం ఏదో ఒక కతను తీసుకుని.. దాని మీద వర్కవుట్ చేయడం బెటర్.
లేదంటే సేఫ్ గా ఏదన్నా రీమేక్ స్టోరీ ఒకటి తీసుకుని.. దానిని వర్కవుట్ చేసుకున్నా బాగానే ఉంటుంది. అంతేకాని.. కథ కోసం నెలల తరబడి వెయిట్ చేస్తే.. అప్పుడు ఏడాదికి ఫ్యాన్స్ ఒక్క సినిమానే చూస్తారేమో. ఆల్రెడీ ఇప్పుడు సీన్ చూస్తే వచ్చే ఏడాది కేవలం ఎన్టీఆర్ ది ఒక్కటంటే ఒక్క సినిమాయే వచ్చేలా ఉంది.