Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Oct-2016 11:00:48
facebook Twitter Googleplus
Photo

మొన్న నరుడా డోనరుడా సినిమా ఆడియో లాంచ్ లో మాట్లాడిన కింగ్ నాగార్జున.. తను ఈ మధ్యనే ఒక మైండ్ బ్లాంక్ చేసే కథను విన్నానని.. దాని వలన అసలు నిద్రే పట్టట్లేదని పేర్కొన్నారు. అయితే ఆ కతను ఎవరు చెప్పారు.. ఏ దర్శకుడు? ఏ రైటర్? అంటూ ఇప్పటికే ఫిలిం నగర్లో నానా భీభత్సంగా అందరూ తలలు బాదేసుకుంటున్న సంగతి తెలిసిందే.

కాకపోతే ఇప్పుడు క్లోజ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. ఈ కథను చెప్పింది ఎవరో కాదట.. యాంకర్ ఓంకారే అంటున్నారు. మనోడు ప్రస్తుతం ''రాజు గారి గది'' సినిమాకు సీక్వెల్ చేస్తున్న సంగతి తెలసిందే. ఈ సీక్వెల్ ''రాజు గారి గది 2''లో స్వయంగా నాగార్జున హీరోగా నటిస్తుండగా.. పివిపి దానిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఈ సీక్వెల్ కతతో పాటు ఓంకార్ అన్నయ్య నాగ్ సార్ కు ఇంకొక కథను వినిపించాడట. ఆ కథలో ఉన్న రియాల్టీ.. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందిన కావడంతో.. నాగ్ షాక్ కు గురయ్యారట.

రాజు గారి గది సీక్వెల్ పూర్తయ్యాక.. ఒక సినిమా గ్యాప్ తీసుకుని.. వెంటనే అప్పుడు ఓంకార్ తో తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్లో ఈ సినిమాను మొదలుపెడతారని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,