నందమూరి బాలకృష్ణకు - పరుచూరి సోదరులకు ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్యకు కోసం రౌడీ ఇన్ స్పెక్టర్ - లారీ డ్రైవర్ - సమరసింహారెడ్డి - నరసింహనాయుడు లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చింది ఈ స్టార్ రైటర్లే. వాళ్లిద్దరిపై బాలయ్యకు అపారమైన నమ్మకం. ఐతే ?పలనాటి బ్రహ్మనాయుడు? సినిమాతో బాలయ్య ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసిన పుణ్యం కూడా పరుచూరి వారిదే. దీంతో ఆ తర్వాత ?లక్ష్మీనరసింహా?కు మినహాయించి మళ్లీ పరుచూరి సోదరులకు అవకాశమివ్వలేదు బాలయ్య. మధ్యలో బాలయ్య కోసం పరుచూరి ఒకటి రెండు కథలు రెడీ చేశారన్న వార్తలు వినిపించాయి కానీ.. సినిమా అయితే ఏదీ పట్టాలెక్కలేదు.
ఐతే తాజాగా పరుచూరి సోదరుల కుటుంబం నుంచి మరో రచయిత.. బాలయ్యను మెప్పించినట్లు సమాచారం. పరుచూరి వెంకటేశ్వరరావు కొడుకు పరుచూరి రవీంద్ర బాలయ్య కోసం చారిత్రక నేపథ్యంలో ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసినట్లు సమాచారం. ఆ కథతో బాలయ్య హీరోగా తనే సినిమా చేయాలని రవీంద్ర ఆశపడుతున్నాడట. ఐతే కథ వరకు బాలయ్య ఓకే అన్నాడట కానీ.. డైరెక్షన్ విషయంలోనే తటపటాయిస్తున్నాడట. ఒకవేళ ఈ కథతో సినిమా చేయడానికి ఓకే అన్నా.. బాలయ్య ఇప్పుడిప్పుడే ఖాళీ అయ్యే అవకాశాలైతే లేవు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ?ఆదిత్య 999?తో పాటు బోయపాటి శ్రీనుతో ఓ సినిమా కూడా చేయాల్సి ఉంది. మరి పరుచూరి రవీంద్ర కథ ఎప్పటికి తెరమీదికి వస్తుందో చూడాలి.