Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Aug-2016 10:36:06
facebook Twitter Googleplus
Photo

కర్ణాటకలోని కోలార్‌లో హత్యకు గురైన తన అభిమాని వినోద్‌ కుటుంబాన్ని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ గురువారం పరామర్శించనున్నారు. సినీ అభిమానుల మధ్య భగ్గుమన్న విభేదాలు కారణంగా వినోద్‌ ఆదివారం హత్యకు గురయ్యాడు. రెండురోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వినోద్‌కుమార్‌ స్వస్థలం తిరుపతి. వినోద్‌ హత్య గురించి తెలియడంతో ఆవేదన చెందిన పవన్ ఆయన కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించారు. గురువారం తిరుపతి వెళ్లి వినోద్‌ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు.

ఇద్దరు హీరోల అభిమానుల మధ్య చోటుచేసుకున్న గొడవలో చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన వినోద్ కుమార్ (24) హత్యకు గురైన సంగతి తెలిసిందే. కోలారు సమీపంలోని నరసాపురం పారిశ్రామిక వాడలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆదివారం కోలారు నగరంలో నిర్వహించిన అవయవదానం కార్యక్రమానికి సినీ నటుడు సుమన్ వచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి నుంచి వినోద్ కుమార్ తన మిత్రుడు త్రినాథ్‌తో కలసి కారులో కోలారు వచ్చాడు.

ఈ సందర్భంగా అవయవ దానం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తరిస్తామని వినోద్‌కుమార్ చెప్తూ.. తన అభిమాన నటుడికి జై కొట్టాడు. దీనికి మరో హీరో అభిమాని అయిన సునీల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో వారి మధ్య గొడవ మొదలైంది. అనంతరం మిత్రులంతా నరసాపురం వద్ద ఉన్న హోటల్ గేట్స్ గ్రాండ్‌కు వెళ్లారు. అక్కడ మళ్లీ గొడవ జరగడంతో సునీల్ వెంట వచ్చిన అక్షయ్‌కుమార్ తన వద్ద ఉన్న కత్తితో వినోద్‌కుమార్‌ను పొడిచాడు. మిత్రులు వినోద్‌ను కారులో తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. పోలీసులు నిందితుడు అక్షయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

,  ,  ,  ,  ,  ,