హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నేడు లండన్ కి ఎర్లీ మార్నింగ్ బయిలుదేరారు. నెల రోజులుగా జరుగుతున్న జయతే కూచిపూడి ఫెస్టివల్ క్లోజింగ్ సెర్మనికు ఆయన హాజరు కానున్నారు. ఈ సందర్బంగా ఆయన ఈ రోజు ఉదయం ఎయిర్ పోర్ట్ లో కనపడినప్పుడు తీసిన కొన్ని ఫొటోలు మీ ముందు ఉంచుతున్నాం. ఆయన అక్కడ లాండ్ అయ్యాక... యూకేలో జరిగే తెలుగు అసోసియేషన్ 6వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొనున్నారు యూకే తెలుగు అసోసియేషన్ పిలుపు మేరకు ఆయన హజరవుతున్నారు. దాంతో యూకేలో పవన్కు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 'యుక్తా'కు చెందిన గుంటుపల్లి జయకుమార్ ఆధ్వర్యంలో పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ఈస్ట్ లండన్ లోని యూకేలోని ట్రాక్సీలో 9వ తేది సాయింత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. తెలుగు జాతిపై అభిమానంతో ఈ కార్యక్రమానికి పవన్ కాళ్యాణ్ రావడం ఎంతో సంతోషంగా ఉందని వారు చెప్తున్నారు.