పవన్ కల్యాణ్, మహేష్ బాబు కలసి ఒకే వేదిక పంచుకోనున్నారా? దీనికి ప్రస్తుతం అవుననే సమాధానం వినిపిస్తోంది టాలీవుడ్ సర్కిల్స్ లో. వీరిద్దరినీ త్వరలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలపనున్నాడని అంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం 'సన్నాఫ్ సత్యమూర్తి' పేరిట ఓ చిత్రం రూపొందుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఆడియో వేడుక వచ్చే నెల 14న నిర్వహిస్తారు. దానికి చీఫ్ గెస్టులుగా పవన్, మహేష్ లను త్రివిక్రమ్ ఆహ్వానించాడట. ఈ దర్శకుడికి వీరిద్దరూ స్నేహితులు కాబట్టి వీరు రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వస్తే కనుక అభిమానులకు అది పెద్ద పండుగే!
alluarjun, trivikram, dsp, raghudixit, maheshbabu, pawankalyan, onestage,