ముంబయి లో అక్టోబర్ 20 నుంచి 27 మధ్యలో జరగనున్న జియో మామి ముంబయి ఫిల్మ్ ఫెస్టివల్ కు పవన్ కళ్యాణ్, సూర్య లు మద్దత్తు తెలిపారు. ఈ ఫెస్టివల్ ను ముంబయి అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ (మామి) సంస్థ నిర్వహించనుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ అనుపమ చోప్రా ఫెస్టివల్ డైరెక్టర్ కు తెలిపారు.
గతం లో సర్ధార్ గబ్బర్ సింగ్ విడుదల సందర్భం గా అనుపమ చోప్రా పవన్ ను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. పవన్, సూర్య లు కాకుండా మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ స్టార్స్ రణవీర్ సింగ్, అనుష్క శర్మ, జాన్ అబ్రహం లు కూడా ఫెస్టివల్ కు వారి మద్దత్తు తెలిపారు