పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కనుందని గతంలోనే ఖాయమైపోయింది. ఇప్పుడీ మూవీని అధికారికంగా కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. నవంబర్ 5న ముహూర్తం పూజ చేయనున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. ప్రొడ్యూసర్ ఆఫీస్ లోనే ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.
ఇప్పటివరకూ రాధాకృష్ణ నిర్మాణంలో రూపొందుతున్న భారీ చిత్రం ఇదే. పైగా టాప్ రేంజ్ హీరోతో కూడా ఈయనకు ఫస్ట్ ఫిలిం. అందుకే సినిమా ప్రారంభాన్నే అట్టహాసంగా చేయాలని తలచారట. కానీ పవన్ మాత్రం సింపుల్ గానే ఈ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పడంతో.. అతి తక్కువ మంది అతిథుల మధ్యే త్రివిక్రమ్-పవన్ ల సినిమా మొదలైపోనుంది. పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్.. నిర్మాత రాధాకృష్ణతో పాటు.. మరికొందరు సన్నిహితులు మాత్రమే నవంబర్ 5న పూజా కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ ముూవీలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉండగా.. ఇంకా ఎవరినీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ నెలాఖరుకల్లా క్యాస్టింగ్ పూర్తయిపోతుందని సమాచారం.
అయితే.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఖాయం చేయగా.. తెలుగులో ఈ కంపోజర్ కు ఇదే మొదటి డైరెక్ట్ మూవీ. పవన్ ఇప్పటికే నిర్మాత ఏఎం రత్నం మూవీకి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించగా.. ఇప్పుడు ఇది రెండో చిత్రం. కానీ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కాటమరాయుడు పూర్తి కాగానే.. ముందు త్రివిక్రమ్ మూవీ షూటింగ్ నే ప్రారంభిస్తాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.