ఒక అడుగు కోలీవుడ్లో .. మరో అడుగు టాలీవుడ్లో వేసి .. ముచ్చటగా మూడో అడుగును బాలీవుడ్లో పెట్టిన కథానాయిక 'పూజా హెగ్డే'. హిందీలో హృతిక్ రోషన్ జోడీగా 'మొహంజోదారో' సినిమా చేసిన ఈ అమ్మాయి, ఆ సినిమా విడుదల వరకూ వేచి ఉండకుండా తిరిగి తెలుగు సినిమాలపై దృష్టి పెట్టడం చర్చలకి దారితీసింది. ఒక లైలా కోసం .. ముకుంద సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మాయి, ఇక ఇక్కడ తన హావాను కొనసాగిస్తుందని అంతా అనుకున్నారు.
అయితే అందుకు భిన్నంగా ఆమె డేట్స్ లేవని చెప్పేసింది. అందుకు కారణం అప్పటికే ఆమె హృతిక్ రోషన్ సినిమాను అంగీకరించడమే. ఇక ఈ సినిమా హిట్ అయితే ఎలాగో హిందీలో ఛాన్సులు వస్తాయి. ఒకవేళ ఆశాభంగాన్ని కలిగిస్తే టాలీవుడ్ సినిమాలు చేతిలో వుండటం మంచిదనే ముందుచూపుతోనే పూజా ఇలా వ్యవహరిస్తోందని అనుకుంటున్నారు. మరి బాలీవుడ్లో 'మొహంజోదారో' ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో .. టాలీవుడ్లో అమ్మడి ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.