Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Aug-2017 10:46:19
facebook Twitter Googleplus
Photo

నేషనల్ స్థాయిలో మార్కెట్ ను ఏర్పరచుకున్నాడు హీరో ప్రభాస్. ఐదేళ్లు ఒకే సినిమా కోసం కష్టపడ్డ ప్రభాస్ ఆ సినిమా హిట్ తర్వాత తన నెక్స్ట్ సినిమా సాహోను వీలైనంత త్వరగా పూర్తి చేసి అభిమానులకు అందించాలనుకుంటున్నాడు ప్రభాస్. అయితే ప్రభాస్ ఈ సినిమాతో సౌత్ లోనే టాప్ హీరోల్లో ఒకరిగా చేరిపోతాడని అంటున్నారు. ఎందుకంటే తెలుగు మరియు తమిళ్- హిందీలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ వారు 150 కోట్లతో నిర్మిస్తున్నారు.

ఈ స్థాయిలో రిలీజ్ అవుతుంది గనక సినిమాకు 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు నేషనల్ మీడియా ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే సౌత్ లో రజినీ తర్వాత ఆ స్థాయిలో ఎవ్వరు రెమ్యూనరేషన్ ను తీసుకుకోలేదట. ఇప్పుడు రజిని తర్వాత ప్రభాస్ చేరనున్నాడని తెలుస్తోంది. పైగా ప్రభాస్ సాహో సినిమా బిజినెస్ ప్రాఫిట్స్ లో షేర్స్ కూడా అందుతాయట. దీంతో ఆ సినిమా హిట్ అయితే ఇంకా ఏ స్థాయికి ప్రభాస్ రేంజ్ పెరుగుతుందో చూడాలి. ఇక సాహో లో హీరోయిన్ గా నటిస్తున్న శ్రద్దా కపూర్ కి యువి సంస్థ 4 కోట్లను అఫర్ చేసిందని టాక్. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

టాలీవుడ్ లో టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఇతరులను ఒకసారి చూస్తే.. మహేష్ - స్పైడర్ సినిమాకు 25-30 కోట్లవరకు అందుకున్నట్లు టాక్. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవన్ కళ్యాణ్ తన 25వ చిత్రానికి కూడా 25 నుండి 30 వరకు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

,  ,  ,  ,  ,  ,