ఓ సిట్యుయేషన్ ని సింపుల్ గా పవర్ ఫుల్ గా చెప్పడంలో పూరీ జగన్నాథ్ కి మించిన రైటర్ మరొకరు కనిపించరనే విషయంపై ఎలాంది సందేహాలు ఉండవు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 500.. 1000 రూపాయల డినామినేషన్ ఉన్న నోట్లను రద్దు చేయడంతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల ముందు.. ఏటీఎంల ముందు క్యూలు కట్టేయాల్సి వస్తోంది. ఇంత చేసినా ఫలితం దక్కుతుందా అంటే.. అన్నీ సార్లు అవునని చెప్పలేం.
ఈ సిట్యుయేషన్ ని పవర్ ఫుల్ డైలాగ్స్ రాసే డైరెక్టర్ పూరీ.. సింపుల్ గా ఒకటే ఒక పంచ్ తో చెప్పేశాడు. 'రెండు వేల నోటుకు చిల్లర మార్చగలిగే వాడు వీరుడు.. అదే 2 వేల నోటుకు చిల్లర ఇచ్చేవాడు దేవుడు' అంటూ పంచ్ వేశాడు పూరీ. నోట్ల మార్పిడిలో భాగంగా.. 500.. 1000 నోట్లు తీసుకుని.. చాలా బ్యాంకుల్లో 2వేల రూపాయల నోట్లు చేతిలో పెడుతున్నారు. వందలు కూడా ఇస్తున్నా.. ఎక్కువగా 2వేల రూపాయల నోట్లు కనిపిస్తుండడంతో.. చిల్లర సమస్య పెరిగిపోయింది.
మామూలుగా ఐదొందల నోటుకే చిల్లర కష్టాలు తప్పవు. అలాంటిది ఏకంగా 2వేల నోటుకు.. అది కూడా కొత్తగా మార్కెట్లోకి వచ్చిన నోటుకు చిల్లర సంపాదించడంలో ఉన్న కష్టాన్ని.. ఇలా వీరుడు.. దేవుడు అంటూ పంచ్ డైలాగ్ రూపంలో చెప్పాడు పూరీ. టైమింగ్ ప్రకారం.. ఈ డైలాగ్ సూపర్బ్ గా పేలింది.