పూరీ జగన్నాథ్ ఇప్పుడు బ్యాంకాక్ లో వున్నాడు. అక్కడి బీచ్ లో ఆయన 'ఆటోజానీ' సినిమా కోసం మాటలు రాయడం మొదలుపెట్టాడు. బ్యాంకాక్ బీచ్ పూరీకి చాలా ఇష్టమైన ప్రదేశం. అందువలన ఆయన తన సినిమాలకి సంబంధించిన కథ.. మాటలు సమకూర్చడం కోసం అక్కడికి వెళుతూ వుంటాడు. అక్కడి వాతావరణం కొత్త ఆలోచనలకి ఊపిరి పోసేదిగా .. ఉత్సాహాన్ని ఇచ్చేదిగా ఉంటుందని ఆయన భావిస్తుంటాడు. అలా ఈసారి కూడా ఆయన ఆటోజాని సినిమా కోసం బ్యాంకాక్ వెళ్లి, తనదైన శైలిలో సంభాషణలు పడటానికి కసరత్తు చేస్తున్నాడు.
అయితే ఇటీవల చిరూ సినిమాలోగా ఆయన నితిన్ సినిమా పూర్తి చేస్తాడనే వార్తలు షికారు చేశాయి. అందులో నిజంలేదనే విషయం తేలిపోయింది. ఇది చిరంజీవి సినిమా కావడం వలన .. అందునా ఆయన 150 సినిమా కావడం వలన పూరీ కాస్త ఎక్కువ దృష్టి పెట్టినట్టు .. పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి బ్యాంకాక్ బీచ్ లో ఆటోజానీకి పూరీ రాస్తోన్న మాటలు మాస్ ఆడియన్స్ ని ఎంతగా ఆకట్టుకుంటాయే చూడాలి.