మొన్ననే ''జన గణ మన'' అంటూ ఒక ప్రాజెక్టు ప్రకటించాడు పూరి జగన్. దానికి ప్రతి స్పందనగా మహేష్ బాబు కూడా.. లుకింగ్ ఫార్వార్డ్ సార్ అన్నాడు. అయితే ఇప్పుడు మహేష్ బ్రహ్మోత్సవం తరువాత మురుగుదాస్ తో చేసే సినిమా 24వ సినిమా కాబట్టి.. ఈ జన గణ మన 25వ సినిమా అయ్యే ఛాన్సుంది. ఇంతేకాదు.. పూరి జగన్ ఇప్పుడు మరో హీరో కోసం మరో మైల్ స్టోన్ డైరెక్ట్ చేయనున్నాడు.
ఆల్రెడీ చేతిలో ''రోగ్'' సినిమా ఒకటుంది. రిలీజ్ చేయాలి. కళ్యాణ్ రామ్ తో సినిమాను షూటింగ్ మొదలెట్టాల్సి ఉంది. ఇవన్నీ కాకుండా మహేష్ తో ఒక ప్రాజెక్టు సెట్ చేసుకున్నాడు. ఇప్పుడేమో విక్టరీ వెంకటేష్ కు కూడా ఒక కథ చెప్పాడట. ఆయన బాబు బంగారం సినిమా పూర్తి చేసి.. కిషోర్ తిరుమల డైరక్షన్ లో కూడా సినిమాను పూర్తి చేసుకుంటే.. 74 సినిమాలు పూర్తవుతాయి. అంటే పూరి జగన్ తో చేసేది 75వ సినిమాయేగా.
మొత్తానికి భలే ఉందండీ. ఇంకా నయం చిరంజీవి 150వ సినిమా కూడా పూరి జగన్ చేతిలోనే పడుంటే.. మనోడు ల్యాండ్ మార్క్ సినిమాల దర్శకుడిగా ప్రసిద్దిగాంచాడు. ఏదేమైనా.. ఈసారి తీసే సినిమాల్లో కేవలం హీరోల బాడీ లాంగ్వేజ్ అండ్ పంచ్ డైలాగులు మాత్రమే కాకుండా.. కథ కూడా ఉండాలని ఆశిద్దాం.