Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Oct-2016 15:24:46
facebook Twitter Googleplus
Photo

కళ్యాణ్ రామ్ తో పూరీ జగన్నాథ్ తీసిన ఇజం మూవీ పూర్తయిపోయింది. త్వరలో మంచి డేట్ చూసుకుని మూవీ రిలీజ్ చేసేయనున్నారు కూడా. ఈ మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు.. ఓ సాలిడ్ హిట్ కొట్టేందుకు పూరీ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. టీజర్ లోనే ఈ సంగతి అర్ధం కాగా.. సినిమాలో ఇంకా చాలానే సంచలనాలు ఉన్నాయని పూరీ సన్నిహితులు చెబుతున్నారు.

మరోవైపు.. పూరీ జగన్నాథ్ తన నెక్ట్స్ ప్రాజెక్టుపై కూడా ఇప్పటికే వర్క్ చేసేశాడు. రీసెంట్ గానే బ్యాంకాక్ లో సిట్టింగ్ వేసి మరీ.. స్క్రిప్ట్ పూర్తి చేసుకు వచ్చాడనే టాక్ ఉంది. అయితే.. ఈ సబ్జెక్ట్ లో హీరో ఎవరనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు కానీ.. పూరీ దగ్గర నుంచి రెండు పేర్లు వినిపిస్తున్నాయట. శ్రీమంతుడుతో ఇండస్ట్రీ టాప్ 2 రికార్డ్ హిట్ సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. జనతా గ్యారేజ్ తో ఇండస్ట్రీ టాప్3 రికార్డుల్లో చోటు దక్కించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ లలో.. ఒకరితో సినిమా చేయాలని చూస్తున్నాడట ఈ దర్శకుడు. ప్రస్తుతం తన పొజిషన్ ని స్ట్రాంగ్ చేసుకోవాలంటే.. నితిన్-కళ్యాణ్ రామ్ లాంటి హీరోలతో సినిమాలు చేస్తే చాలదని పూరీ ఫిక్స్ అయ్యాడని అంటున్నారు.

అందుకే ఇండస్ట్రీ టాప్-5 హిట్స్ లో తన ఒక మూవీ ఉండాలని భావిస్తున్న పూరీ.. అందుకు వీలుగానే ఈ స్కెచ్ వేశాడని తెలుస్తోంది. ఇజం మూవీని నెలాఖరుకు విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈ లోపే కొత్త ప్రాజెక్ట్ ఫైనల్ చేసేసి.. నవంబర్ మధ్యలో పట్టాలెక్కించాలని పూరీ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది

,  ,  ,  ,  ,