యువ హీరో రాజ్ తరుణ్ కుక్కల వెంట పడ్డాడు. కుక్కల్ని కిడ్నాప్ చేసి, యజమానుల దగ్గర్నుంచి డబ్బులు పిండుకొంటున్నాడు. అంటే.. కుక్కల కిడ్నాపర్ అన్నమాట. రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. దొంగాట ఫేమ్ వంశీకృష్ణ దర్శకుడు.
ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కుక్కల్ని కిడ్నాప్ చేసి, డబ్బులు సంపాదిస్తుంటాడట. అంతేకాదు.. కుక్కలతో మాట్లాడుతుంటాడట. ఓ కుక్క? రాజ్ తరుణ్ జీవితాన్నే మలుపు తిప్పుతుందట. ఏంటో ఈ కాన్సెప్ట్ కాస్త వెరైటీగా ఉంది.
రాజమౌళి ఈగ.. రవిబాబు పంది.. ఇప్పుడు రాజ్ తరుణ్కుక్కని పట్టుకొన్నాడు. మొత్తానికి టాలీవుడ్లో జంతువులకు డిమాండ్ బాగానే ఉంది. మరి ఈ కొత్త కాన్సెప్ట్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి