Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2017 11:19:53
facebook Twitter Googleplus
Photo

బాహుబలి2 చారిత్రాత్మక విజయం సాధించి.. దేశంలోనే అతి పెద్ద చిత్రంగా అవతరించిన తర్వాత.. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఏం చేసినా రకరకాల అర్ధాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి లాభాల నుంచి వాటాల రూపంలో భారీ మొత్తమే చేతికి అందడంతో.. ఈ మొత్తాన్ని స్థలాలపై ఇన్వెస్ట్ చేస్తున్నాడంటూ పలు ఏరియాల పేర్లు చెబుతున్నారు.

బాహుబలి ది కంక్లూజన్ విడుదలకు ముందే.. హైద్రాబాద్ పరిసరాల్లో 20 ఎకరాలు కొన్నాడని అన్నారు. ప్రస్తుతం ఈ ఫిగర్ 100 ఎకరాలకు చేరిపోయింది. దొనకొండ సమీపంలో ఈ ఫామ్ హౌస్ ఉంటుందని టాక్. మరోవైపు ఉత్తరాంధ్ర స్థానిక ఎగ్జిబిటర్లకు.. తాజాగా నిర్మాత సాయి కొర్రపాటి ఓ పార్టీ ఇచ్చాడు. బాహుబలి2 ను ఇక్కడ రిలీజ్ చేసింది ఈయనే. ఆల్ టైం రికార్డ్ స్థాయిలో 25 కోట్ల మొత్తాన్ని వసూలు చేసిందీ చిత్రం. వైజాగ్ లో జరిగిన ఈ పార్టీకి చీఫ్ గెస్ట్ రాజమౌళి అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.

అయితే.. ఈ పార్టీ తర్వాత.. రాజమౌళి వైజాగ్ లో ల్యాండ్ కొనబోతున్నాడంటూ టాక్ వచ్చింది. బీచ్ గెస్ట్ హౌస్ కట్టుకునేందుకు గాను.. వైజాగ్ పరిసరాల్లో కొన్ని ఎకరాలు కొనబోతున్నాడన్నది వీటి సారాంశం.

,  ,  ,  ,  ,