స్టార్ హీరో సూర్య నటించిన సింగం 3 ఈ గురువారం (ఫిబ్రవరి 9న) తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోన్న విషయం తెలిసిందే. సూర్యకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా, సుమారు 2000 థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు టీమ్ సిద్ధమవుతోంది. ఇక విడుదలకు మరికొద్ది గంటలే ఉండగా, టీమ్ను పైరసీ భూతం వెంటాడుతోంది. ముఖ్యంగా కొన్ని వెబ్సైట్లు ?సింగం 3? సినిమాను విడుదల రోజునే మార్నింగ్ షో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చాలెంజ్ చేయడంతో సింగం 3 నిర్మాతలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే మద్రాస్ హైకోర్టులో పైరసీని అడ్డుకోమంటూ టీమ్ విన్నవించుకోవడంతో, విచారణ చేపట్టిన కోర్టు, సర్వీస్ ప్రొవైడర్లకు పైరసీ అన్న పేరున్న సైట్లను బ్లాక్ చేయమని అదేశాలిచ్చింది. దీంతో సింగం టీమ్కు కొంత ఊరట లభించినట్లే అని చెప్పొచ్చు. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించింది. సూర్య సరసన అనుష్క, శృతి హాసన్లు హీరోయిన్లుగా నటించారు.