దేశ వ్యాప్తంగా రజనీకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా వస్తుందంటే .. పెద్ద పండుగ వస్తున్నట్టుగా అభిమానులు సంబరపడిపోతుంటారు. అలాంటి రజనీ తరువాత స్థానంలో హీరో విజయ్ పేరు వినిపిస్తోంది. అలా ఆయన రజనీ తరువాత స్థానాన్ని చేరుకున్నది రెమ్యునరేషన్ విషయంలో! తమిళ్లో రజనీ ఒక్కో సినిమాకి 35 నుంచి 40 కోట్ల వరకూ పారితోషికంగా తీసుకుంటాడట. ఇక తాజాగా విజయ్ తాను నటిస్తున్న సినిమాకి గాను 30 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
అట్లీ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తోన్న సినిమాకిగాను ఆయన ఈ పారితోషికాన్ని అందుకున్నాడు. కోలీవుడ్లో రజనీ తరువాత ఈ స్థాయిలో పారితోషికాన్ని అందుకున్న కథానాయకుడు విజయ్ మాత్రమేనని అంటున్నారు. ఇటీవల కాలంలో ఆయన నటించిన ప్రతి సినిమా అనూహ్యమైన విజయాన్ని అందుకుంటూ ఉండటమే ఇందుకు కారణమనే టాక్ కోలీవుడ్ సినీవర్గాల్లో వినిపిస్తోంది.